వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ దోచుకు తింటోంది: ఎన్టీఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
విశాఖపట్నం: రాష్ట్రాన్ని కాంగ్రెసు నేతలు దోచుకు తింటున్నారని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆరోపించారు. అడవులను, సంపదను, గనులనే కాదు ఇసుకను కూడా దోచుకు తింటున్నారని, అలాంటి దోపిడీదారులను కాంగ్రెస్ కాపాడుతూ వస్తోందని ఆయన అన్నారు. గురువారంనాడు ఆయన పర్యటన విశాఖపట్నం జిల్లాలో కొనసాగింది. మన ప్రాణాలను, మానాలను, ఆత్మగౌరవాన్ని కాంగ్రెసు పార్టీ దెబ్బ తీస్తోందని ఆయన అన్నారు.

కాంగ్రెసు అభివృద్ధి చేపట్టానికే గాని చూడడానికి ఏమీ ఉండదని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేవని అంటున్నారని, సొంత కంపెనీలకు మాత్రం గనులను దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. అత్యాచారానికి గురైన వాకపల్లి గిరిజన మహిళలకు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కోస్తా కారిడార్ ను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X