రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
హైదరాబాద్: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. వీరిని హైదరాబాదులోని రాంనగర్ కు చెందిన ఓంకార్, రాజు లుగా గుర్తించారు. మోటార్ సైకిల్ వేగం వల్ల అదుపు కాలేదని, దీంతో డివైడర్ కు ఢీకొట్టిందని అంటున్నారు.
Comments
Story first published: Saturday, March 21, 2009, 11:35 [IST]