సత్తా ఉంటే మమ్మల్ని ఆపండి: వైయస్

తెలుగుదేశం, తదితర ప్రతిపక్షాలు విశ్వసనీయత కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం, వామపక్షాలు ప్రతిపక్షాలుగా విజయం సాధించి ఉంటే రాష్ట్రంలో మూడో పార్టీ వచ్చి ఉండేది కాదని ఆయన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. ప్రతిపక్షాలకు తగిన బలం ఉంటే చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా తక్కువగా ఉందని, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల మధ్య చీలిపోయి తమ పార్టీకి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. బావ హామీలకు బావమరిది భరోసా ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆయన ఆయన చంద్రబాబు హామీలను అమలు చేయిస్తానని బాలకృష్ణ ప్రజలకు చెప్పడంపై వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications