Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరుణ్ కి అద్వానీ ప్రచారం

Varun Gandhi
న్యూఢిల్లీ: జైలు నుంచే ఉత్తరప్రదేశ్ లోని ఫిలిభిత్ లోకసభ సీటుకు పోటీ చేసే వరుణ్ గాంధీ తరఫున ఎల్.కె.అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ప్రచారం చేస్తారు. నాసా కింద అరెస్టయి వరుణ్ గాంధీ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఫిలిభిత్ నుంచి తమ పార్టీ అభ్యర్థి వరుణ్ గాంధీయేనని, వరుణ్ ను ఒంటరిగా వదిలేయబోమని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇంచార్జీ కల్ రాజ్ మిశ్రా మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వరుణ్ గాంధీ తరఫున ప్రచారం చేయడానికి బిజెపిలో ఎవరు వ్యతిరేకిస్తారని ఆయన ప్రశ్నించారు.

అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ నియోజకవర్గానికి వస్తారని ఆయన చెప్పారు. భవిష్యత్తు కార్యక్రమాన్ని పార్టీ ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. వరుణ్ ను జైలు నుంచి బయటకు తీసుకురావడం ప్రస్తుతం తమ ముందున్న కార్యక్రమమని ఆయన అన్నారు. పథకం ప్రకారం కాంగ్రెస్, బిఎస్పీ వరుణ్ కు అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు. బెయిల్ రాకపోతే జైలు నుంచే వరుణ్ పోటీ చేస్తారని ఆయన చెప్పారు. ఈ స్థితిలో వరుణ్ తరఫున ప్రచారం చేయడానికి ఒక ప్రతినిధిని నియోగిస్తారు. మరో గాంధీకి ప్రాముఖ్యం లభించకూడదనేది ప్రధాని మన్మోహన్, గాంధీ కుటుంబ సభ్యుల ఉద్దేశ్యమని కల్ రాజ్ మిశ్రా అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+