భార్యతో వచ్చి ఓటేసిన బాలయ్య

Balakrishna
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బావ మరిది బాలకృష్ణ భార్యతో కలిసి వచ్చి హైదరాబాదులోని జూబిలీ హిల్స్ లో ఓటేశారు. లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ కాంగ్రెసు అభ్యర్థి దానం నాగేందర్ ఆయనకు ఎదురుపడ్డారు. కాంగ్రెసుకు ఓటేయాలని దానం నాగేందర్ జయప్రకాష్ నారాయణను కోరారు.

తెలుగుదేశం నాయకుడు అశోక్ గజపతి రాజు విజయనగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకురాలు విజయశాంతి హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభా నియోజక వర్గంలో తన ఓటు వేశారు. బిజెపి నాయకుడు ఇంద్రసేనా రెడ్డి మలక్ పేట శాసనసభా నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను వచ్చిన సమయంలో ఇవియంలు సరిగా పనిచేయకపోవడంతో ఆయన అరగంట పాటు వేచి ఉండాల్సి వచ్చింది. సూర్యాపేటలో మంత్రి దామోదర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మెదక్ నియోజక వర్గంలో తన ఓటు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+