వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాబినెట్ మీట్ కు లాలూ డుమ్మా

By Staff
|
Google Oneindia TeluguNews

Lalu Prasad Yadav
న్యూఢిల్లీ: శుక్రవారంనాడు జరిగే ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గ సమావేశానికి బీహార్ కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు డుమ్మా కొట్టే అవకాశాలున్నాయి. కాంగ్రెసు నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థి నితీష్ కుమార్ ను ప్రశంసించడంపై ఆగ్రహం చెందిన రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మరో మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రైల్వే మంత్రి మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం లేదని లాలూ ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి భోలా యాదవ్ చెప్పారు. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా లాలూ పలు మంత్రి వర్గ సమావేశాలకు హాజరు కాలేదని, తన శాఖకు చెందిన అంశం చర్చకు ఉంటే తప్ప లాలూ మంత్రి వర్గ సమావేశానికి హాజరు కారని ఆయన చెప్పారు. నితీష్ కుమార్ పనితీరును ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రశంసించిన విషయం తెలిసిందే. రాహుల్ ప్రకటన వెలువడిన వెంటనే లాలూ, పాశ్వాన్ నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X