వరుణ్ పై నాసా చెల్లదు

ఇది ప్రజాస్వామ్య విజయమని బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడు త్రిపాఠీ అన్నారు. బోర్డు ఆదేశాలు యూపీఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను బట్టబయలు చేశాయని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవేదకర్ అన్నారు. వరుణ్ గాంధీ పోటీ చేస్తున్న పిలిభిత్, మేనకాగాంధీ బరిలో ఉన్న నియోజవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై ఆచితూచి స్పందించింది. సత్ప్రవర్తనతో మెలుగుతానని వరుణ్గాంధీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాడని పార్టీ నాయకుడు కపిల్ సిబాల్ గుర్తుచేశారు. నాసా ప్రయోగించాలని మాయావతి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకెలాంటి సంబంధం లేదన్నారు.
సలహా సంఘం ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సంఘం తీర్పు ఏకపక్షంగా ఉందని, కీలక ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని బీఎస్పీ నాయకుడొకరు అన్నారు.












Click it and Unblock the Notifications