కాశ్మీర్ లో ఇద్దరు మిలిటెంట్ల హతం
జమ్ము: జమ్ము కాశ్మీర్ లోని దోడా జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ తో పాటు అతని అనుచరుడు హతమయ్యారు. ఉగ్రవాదుల ఉన్నారనే సమాచారం అందడంతో శుక్రవారం సాయంత్రం సైన్యం, పోలీసు బలగాలు దోడా జిల్లాలోని ధర్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం ఉదయం ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయని దోడా రేంజ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ హేమంత్ లోహియా చెప్పారు.
ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా జిల్లా కమాండర్ అబూ సమామా, అతని అంగరక్షకుడు బర్కత్ అలీ మరణించారు. సమామా పాకిస్తాన్ దేశీయుడు కాగా అలీ స్థానికుడు. గత నాలుగైదేళ్లుగా సమామా ఈ ప్రాంతంలో పని చేస్తున్నాడు. ఎదురు కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. సంఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications