శ్రీలంకపై కరుణతో నారాయణన్ భేటీ
న్యూఢిల్లీ: ఎల్టీటిఇ ఓటమి, ఆ సంస్థ అధినేత వి. ప్రభాకరన్ మృతి సంఘటన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ శ్రీలంకు బయలుదేరి వెళ్తున్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి ఆయన శ్రీలంక వెళ్తున్నారు. శ్రీలంకలోని తమిళుల పరిస్థితిపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వారికి పునరావాసం కల్పించాలని కోరుతోంది.
కొలంబోకు బయలుదేరే ముందు నారాయణన్ డిఎంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధిని కలిశారు. శ్రీలంకలోని పరిస్థితిపై ఆయన వివరించారు.శ్రీలంకలోని తమిళుల పరిస్థితిపై కరుణానిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను శ్రీలంకకు వెళ్తున్నానని, దానికి ముందు కరుణానిధి సలహా తీసుకోవడానికి వచ్చానని నారాయణన్ చెప్పారు.
తమిళుల ప్రయోజనాలు కాపాడుతామని ఆయన చెప్పారు. ప్రభాకరన్ మృతిపై తమకు అంతకన్నా ఎక్కువ సమాచారం లేదని, శ్రీలంకకు వెళ్లిన తర్వాత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తమిళుల పునరావాసానికి భారత ప్రభుత్వం 500 కోట్ల పునరావాస ప్యాకేజీ ప్రకటించింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications