రాష్ట్రపతితో సోనియా, మన్మోహన్ భేటీ

ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కలవాలని బుధవారం ఉదయం జరిగిన ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యుపిఎ సమావేశంలో కూటమి చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకున్న పార్టీలతో, ఇతర పార్టీలు కొన్ని యుపిఎకు మద్దతు ప్రకటించాయి. దీంతో యుపిఎ బలం లోకసభలో 316 సభ్యులకు చేరింది.












Click it and Unblock the Notifications