రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెళకువలు తెలియకే..చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ఒలింపిక్‌ క్రీడలో సైతం తర్ఫీదు తీసుకోవాల్సి ఉంటుందని, ఆటలో మెళకువలు పాటించాల్సి ఉంటుందని, తమ పార్టీ అలాంటి వేమీ చేయకపోవడం వల్లనే ఓటమిపాలైందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. రెండు మహా వృక్షాలు (కాంగ్రెస్‌, టీడీపీ) ఉన్న చోట, వాటిని తట్టుకుని ఎనిమిది నెలల్లో 70 లక్షల ఓట్లు సాధించడం చిన్న విషయమేమీ కాదన్నారు. ప్రజారాజ్యం ఒక మహావృక్షంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోమవారం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఈ సందర్భంగా చిరంజీవి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఉన్న బలాన్ని, తన ఇమేజ్‌ను ఓట్ల రూపంలోకి మలచుకోవడంలో విఫలమయ్యామని అంతకు ముందు చిరంజీవి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X