జేసీకే ఇవ్వండంటూ వైయస్

JC Diwakar Reddy
హైదరాబాద్‌: పదవి ఇవ్వలేదని తీవ్ర నిరాశకు గురైన మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డిని ముఖ్యమంత్రి వైయస్ మొత్తానికి ఊరడించారు. ఆయనని 13వ శాసనసభకు ప్రొటెం స్పీకరుగా నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నరు ఎన్డీ తివారీకి ప్రభుత్వం సిఫార్సుచేసింది. దివాకరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు...మంత్రిగా చేసారు. అయితే మంత్రివర్గ తొలి విస్తరణలో ఆయనకు వైఎస్‌ అవకాశమివ్వలేదు.

దాంతో నిరాశకు గురైన జేసీ ప్రొటెం స్పీకరుగా వ్యవహరిస్తారో లేదో పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి రోశయ్య ఆయనకు ఫోనుచేశారు. ప్రొటెం స్పీకరుగా ఉండాలని కోరారు. తానెందుకని జేసీ ప్రశ్నించగా..దివాకరరెడ్డే ప్రొటెం స్పీకర్‌ ఉండాలని వైఎస్‌ చెప్పారని మంత్రి తెలిపారు. జేసీ అంగీకరించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ప్రొటెం స్పీకరుగా ప్రమాణం చేస్తారు. అనంతరం 10.30కి 13వ శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.

సాధారణంగా ఎక్కువసార్లు ఎన్నికైన వారిని ప్రొటెం స్పీకర్‌ గా ఎన్నుకునే విధానాన్ని అమలు చేస్తూంటారు. ఆ రకంగా చూస్తే ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పి.అశోక్‌ గజపతి రాజు ఈ పదవికి అర్హుడు. కానీ, అధికార పార్టీ మాత్రం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన కె.జానారెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డి, జేసీ దివాకరరెడ్డిల పేర్లు పరిశీలించింది ఈ నిర్ణయం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+