టిడిపిలోనే ఉంటా: ప్రసన్న
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆ పార్టీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాలపై విమర్శలు గుప్పిస్తూ ఆయన మంగళవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. దాంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. తాను కాంగ్రెసు పార్టీలో చేరబోనని ఆయన బుధవారం ఉదయం ఒక టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు.
తాను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని, అయితే నియోజక వర్గం అభివృద్ధి పనుల గురించి మాత్రమే తాను ముఖ్యమంత్రిని కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో కొంత మంది నాయకుల తీరు బాగా లేదని, అందుకే తాను ఆ బహిరంగ లేఖ రాశానని ఆయన చెప్పారు. అప్పుడప్పుడు ఇటువంటి బహిరంగ లేఖలు రాయడం ప్రసన్న కుమార్ రెడ్డికి సహజమేనని గత ఉదంతాలను కొంత మంది తెలుపుతున్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications