విద్యుత్ పరికరాల పరిశ్రమకు ఆమోదం
హైదరాబాద్: చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద విద్యుత్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బీహెచ్ ఈఎల్, ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటుచేస్తారు. ఇందుకోసం 750 ఎకరాల భూమిని ఎకరాకు వంద రూపాయల చొప్పున కేటాయిస్తారు. ఈ పరిశ్రమ శంకుస్థాపనకు ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. మంత్రి వర్గ సమావేశం వివరాలను సమాచారం మంత్రి జె.గీతారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో అందించారు.
ఈనెల 22నుంచి ప్రతి సోమవారం జిల్లా సమీక్షలు జరపాలని కూడా సీఎం నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు గీతారెడ్డి చెప్పారు. పార్టీ వ్యవస్థాగత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. కడప జిల్లా పొద్దుటూరులో వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు 115 ఎకరాల భూమిని కేటాయిస్తూ కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications