వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు అనుమానాలు వద్దు: పాక్

By Staff
|
Google Oneindia TeluguNews

Rehman Malik
ఇస్లామాబాద్: ముంబయి దాడులకు పాల్పడినవారిని శిక్షించే విషయంలో తాము తీసుకునే చర్యలపై భారత్ అనుమానాలు పెట్టుకోవద్దని పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నారు. జమాత్ - ఉద్ - దావా చీఫ్ హఫీజ్ సయీద్ విడుదల నేపథ్యంలో భారత్ తమపై అనుమానాలు పెట్టుకోవద్దని, ముంబై దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇస్లామాబాద్ లోని బారత్ హై కమిషనర్ ను ఆయన శనివారం ఉదయం కలిశారు.

సయీద్ విడుదలపై వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ లో కోర్టులు, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి కోసం భారత్ చర్చలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.చర్చల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సయీద్ విడుదల వల్ల ముంబై దాడుల నిందితులపై చర్య తీసుకునే విషయంలో పాకిస్తాన్ కు నిబద్ధత లేదని భారత్ అభిప్రాయపడుతోందని భారత హై కమిషనర్ శరత్ సబర్వాల్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X