పడవ మునక: జాలర్లు క్షేమం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలో మునిగి 8 మంది గల్లంతయ్యారు. అయితే వారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. వజ్రకొత్తూరు మండలం దేవునల్తాడ సముద్ర తీరంలో చేపలకోసం జాలర్లు పడవలో వెళ్లారు. పడవ మునిగిపోవటంతో అందులోని 8 మంది గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారు క్షేమంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Story first published: Thursday, June 25, 2009, 11:51 [IST]