వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సాలో మావోయిస్టుల విధ్వంసం

By Staff
|
Google Oneindia TeluguNews

Chidambaram
భువనేశ్వర్: కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం పర్యటన చేయనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో విధ్వంసానికి దిగారు. నక్సలైట్లు మొబైల్ టవర్లను, పిల్లగిగ్ రైల్వై ఆస్తులను ధ్వంసం చేశారు. మావోయిస్టులను ఎదుర్కోవడానికి పోలీసుల సమాయత్తాన్ని సమీక్షించేందుకు చిదంబరం కోరాపుట్ వస్తున్నారు. కోబ్రా బెటాలియన్ కేంద్రంలో చిదంబరం మల్కాన్ గిరి, రాయగడ, నారంగ్ పూర్, కోరాపుట్ జిల్లాల ఎస్పీలతో ఆయన చర్చలు జరుపుతారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కూడా ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది.

నారాయణపట్నలోని కాకరిగుమా వద్ద నక్సల్స్ మొబైల్ ఫోన్ కంట్రోల్ రూంలను పేల్చివేశారు. గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ సిగ్నల్ ప్యానెల్ ను కూడా వారు ధ్వంసం చేశారు. భువనేశ్వర్ కు 500 కిలోమీటర్ల దూరంలో ఉండే కోరాపుట్ లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ కు సంబంధాలు కూడా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X