న్యూఢిల్లీ: అబ్దుల్ కలాంకు అమెరికన్ కాంటినెంటల్ ఎయిర్లైన్స్ క్షమాపణలు చెప్పింది. ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ అధికారులు అంగీకరిస్తూ తమ అమర్యాదకర ప్రవర్తనపై క్షమాపణలు చెప్పింది. అమెరికా విమానయాన సిబ్బంది ఏప్రిల్ 24న సాధారణ ప్రయాణికులవలెనే కలాంను తనిఖీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అమెరికా విమానయాన సంస్థకు కేంద్రం షోకాజ్ నోటీసులు పంపింది. ఇందుకు ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది.