వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీరులో 6గురు మిలిటెంట్ల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

Army
పూంచ్: నియంత్రణ రేఖ వెంబడి మిలిటెంట్లు భారత్ లోకి ప్రవేశించే యత్నాన్ని భారత భద్రతా బలగాలు మంగళవారం, బుధవారం భగ్నం చేశాయి. పూంచ్ జిల్లాలో ఈ సంఘటనలు జరిగింది. భద్రతా బలగాల చేతిలో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కొంత మంది మిలిటెంట్లు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి యత్నించారు. మాండీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మిలిటెంట్ మరణించాడు.

కాగా, కాశ్మీరు లోయలో బుధవారం జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. సాయుధ మిలిటెంట్లు తాంగ్ధర్ లోకి ప్రవేశించారు. వారిని భారత సాయుధ బలగాలు ఎదుర్కున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు.కెరాన్ సెక్టార్ లో సాయుధ బలగాలు మరో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X