అభివృద్ధితో రుణం చెల్లిస్తా: సిఎం
హైదరాబాద్: అభివృద్ధితో రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని ఆయన చెప్పారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సాగునీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణాలు ఆగవని ఆయన చెప్పారు.
స్వాతంత్ర్య సమరయోధులు దేనికోసమైతే త్యాగాలు చేశారో ఆ లక్ష్యం దిశగా మనం పయనిస్తున్నామా లేదా అనే సందేహం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రజలు ఏ అభివృద్ధినైతే ఆశించి ఓట్లు వేశారో ఆ అభివృద్ధిని సాధిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కంది పంట విస్తీర్ణం పెరుగుదలకు కృషి చేస్తున్నామని, ధరల అదుపునకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.
కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు 84 ప్రాజెక్టులు చేపట్టామని, పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని, అది ఫలించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మరిన్ని కేంద్ర నిధుల కోసం అడిగామని, మన పథకాలు నచ్చింనందున ఆ నిధులు ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విమానాశ్రయాలు, ఓడరేవుల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications