హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు.కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న కోరిక తీరకుండానే వైయస్ కన్ను మూయడం బాధాకరమని ఆయన అన్నారు. వైయస్ భౌతికంగా మన మధ్య లేకపోయినా చరిత్రలో చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా మిగిలిపోతారని ఆయన అన్నారు. ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి వైయస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
భగవంతుడు వైయస్ ఆత్మకు శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించివారికి కూడా ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు.