దుఖ్కం దిగమింగుతూ, చేతులు జోడించి...

ఆయన బలవంతాన దుఖాన్ని దిగమింగుకుంటన్నట్లు ఆయన ముఖం పట్టిస్తోంది. దారిపొడుగునా ప్రజలు వైయస్ భౌతిక కాయంపై పూలు కురిపిస్తూ నివాళులర్పించారు. వాహనంపై మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు అజరుద్దీన్, వైయస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు, వైద్య ఆరోగ్య మంత్రి దానం నాగేందర్, వైయస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావు ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గాంధీభవన్ కు వైయస్ భౌతిక కాయం చేరడానికి గంటల సమయం పట్టింది. గాంధీ భవన్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియానికి తరలిస్తారు. ఎల్బీ స్టేడియంలో వైయస్ ను చివరి సారి చూడడానికి ఇప్పటికే వేలాది మంది గుమికూడి ఉన్నారు. తొక్కిసలాటలో ఒక కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయాడు.












Click it and Unblock the Notifications