శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబుల్ సానుభాతితోనే గెలుపు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉప ఎన్నికల్లో కాంగ్రెసు డబుల్ సానుభూతితోనే గెలిచిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శాసనసభ్యుడు రేవతీపతి, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాలతో సానుభూతి ఓట్లు కాంగ్రెసు పార్టీకి పడ్డాయని, దాంతోనే కాంగ్రెసు పార్టీ గెలిచిందని ఆయన అన్నారు. టెక్కలిలో తమ పార్టీ కాంగ్రెసుకు గట్టి పోటీ ఇచ్చిందని ఆయన అన్నారు. గతంలో కన్నా తమ ఓట్లు ఈసారి పెరిగాయని ఆయన అన్నారు.

బూర్గుల రామకృష్ణారావు 42వ జయంతి సందర్భంగా చంద్రబాబు సోమవారం గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బూర్గుల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆయన అన్నారు. రైతులకు బూర్గుల ఎంతో మేలు చేశారని, బూర్గుల ఆశయాలకు మనం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X