కష్టపడినవారికి ఇచ్చాం: చిరు

Chiranjeevi
హైదరాబాద్: కష్టపడినవారికే పార్టీ పదవుల్లో స్థానం కల్పించామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా అధ్యక్షులను నియమిస్తూ ఒక ప్రకటన చేశారు. నిబద్ధతతో పనిచేసేవారికే స్థానం కల్పించినట్లు ఆయన తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ ఈ పేర్లకు తుది రూపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీలో ఆరుగురిని నియమించారు. ఏడుగురు ఉపాధ్యక్షులను, తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శలను ఆయన నియమించారు. పది మంది జిల్లా అధ్యక్షుల పేర్లను ఆయన ప్రకటించారు. మిగతా జిల్లాల అధ్యక్షులను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జీగా శ్రీనివాస యాదవ్ ను నియమించినట్లు ఆయన తెలిపారు.

పార్టీ ఉపాధ్యక్షులు: వంగవీటి రాధాకృష్ణ, కనకారావు మాదిగ, కెప్టెన్ మూర్తి, వి. వరప్రసాద్, మోహన్ రావు, అమర్ సింగ్ తిలావత్, దేవిశెట్టి శ్రీనివాస్.

ప్రధాన కార్యదర్శులు: పాదూరి కరుణ, బస్వరాజు శ్రీనివాస్, డాక్టర్ సి. ఉమామల్లేశ్వర రావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎరావత్రి అనిల్, శ్రీకాంత్ రెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, రహ్మాన్, తోట త్రిమూర్తులు.

కార్యనిర్వాహక కార్యదర్శి ఎఎం రాధాకృష్ణను నియమించినట్లు చిరంజీవి తెలిపారు. పార్టీ అనుబంధ సంస్థలను కూడా త్వరలోనే పునర్వ్యస్థీకరించనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+