మీడియాకు రఘువీరా హెచ్చరికలు

ఎన్ని వార్తలు రాసినా ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరని ఆయన అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. తాము తమ అభిప్రాయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గానికి వినిపించామని, అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీ అధిష్ఠాన వర్గం నుంచి వెంటనే నిర్ణయం వస్తుందని ఆశించడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాము ప్రయత్నాలు చేస్తున్నామని, తమ ప్రయత్నాలకు కూడా పరిమితులున్నాయని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠాన వర్గానికి వినిపించడం తమ బాధ్యత అని, అదే పని చేశామని ఆయన చెప్పారు. తాము తమ నాయకుడు వైయస్ పోయిన షాక్ నుంచి తేరుకోక ముందే తప్పుడు కథనాలు రాయడం మీడియా ప్రారంభించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications