జగన్ సిఎం కావాలి: రామానాయుడు

Rama Naidu
హైదరాబాద్: వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు అన్నారు. ఆయన ఆదివారం రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావును కలుసుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం దురదృష్టకరమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందని ఆయన చెప్పారు. కెవిపిని కలిసి తన సానుభూతి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, స్వర్గీయ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా కెవిపి రామచందర్ రావును కలుసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి అర్హుడని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిగా నియమించడంలో కాంగ్రెసు అధిష్ఠాన వర్గం ఎందుకు జాప్యం చేస్తోందో తెలియడం లేదని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించగలిగే నాయకుడు జగన్ తప్ప మరొకరు లేరని ఆమె అభిప్రాయపడ్డారు. మెజారిటీ ప్రజలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలోని 63 శాతం మంది ప్రజలు జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నట్లు సర్వేలో కూడా వెల్లడైందని లక్ష్మీపార్వతి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+