చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీవ్ గాంధీ కిల్లర్ నిరాహార దీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

Nalini
చెన్నై: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ తమిళనాడులోని వెల్లూరు జైలులో నిరాహార దీక్ష చేస్తోంది. తనను త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె సోమవారం నిరాహాక దీక్ష ప్రారంభించింది. తన విడుదలకు సరైన సలహా బోర్డు ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్ మద్రాసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలో ఆమె నిరాహార దీక్ష ప్రారంభించింది. బోర్డును పునర్వ్యస్థీకరించాలని హైకోర్టు నిరుడు చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శిస్తోంది.

ఆమెకు విధించిన మరణశిక్షను నిరుడు జీవిత ఖైదుగా మార్చారు. ఆమె ఇప్పటి వరకు 18 ఏళ్ల పాటు జైలులో ఉంది. సోమవారం ఉదయం నుంచి ఆహారం తీసుకోవడానికి నళిని నిరాకరిస్తున్నట్లు జైలు వర్గాలు చెప్పాయి. తన విడుదలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను అమలు చేసేవరకు తన ఆమరణ నిరాహార దీక్ష సాగుతుందని ఆమె అంటోంది. బోర్డును సరిగా ఏర్పాటు చేయనందున దాన్ని పునర్వ్యస్థీకరించాలని హైకోర్టు నిరుడు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోవడం లేదు. నళిని ఇటీవలే ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ అప్లికేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X