క్యాన్సరే అతన్ని పట్టిచ్చింది

జార్ఖండ్ లో అరెస్టయిన ఒక మావోయిస్టు నేత లాప్ టాప్ నుంచి డాక్యుమెంటును స్వాధీనం చేసుకున్న పోలీసులు గాంధీ ఆచూకీ కోసం మనుషులను నియోగించడమే కాకుండా టెలికం, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ నెట్ వర్కును వాడుకున్నారు. దాంతో వారు గాంధీని పట్టుకోగలిగారు. గత రెండు నెలలుగా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాంధీ కదలికలపై నిఘా పెట్టారు. పోలీసులు అతన్ని ఇంతకు ముందే అరెస్టు చేసి ఉండేవారు. అయితే అతని నెట్ వర్కును ఛేదించే ఉద్దేశంతో ఆగారు.
మావోయిస్టుల ప్రచార విభాగం ఇంచార్జీ అయిన గాంధీకి ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో క్యాన్సర్ కు,గుండె సంబంధమైన సమస్యలకు చికిత్స జరుగుతోంది. గాంధీ ముంబైలోని సంపన్నమైన పార్సీ కుటుంబానికి చెందినవాడు. 1970 తొలి నాళ్లలో అతను నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లాడు. అతను డూన్ స్కూల్లో చదువుకున్నాడు.












Click it and Unblock the Notifications