వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఇష్యూ: హైకమాండ్ పై ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

కాకినాడ: వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంలో చేస్తున్న జాప్యంపై పార్టీ అధిష్ఠాన వర్గం మీద కాంగ్రెసు కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విరుచుకుపడ్డారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పార్టీ అధిష్ఠాన వర్గం కించపరుస్తోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే కాంగ్రెసు పార్టీకి 1983లో ఎదురైన పరిస్థితే ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు కోరుతున్నారని, అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా కోరుతున్నారని, అయినా అధిష్ఠాన వర్గం జాప్యం చేస్తోందని, ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కాంగ్రెసు రాష్ట్రంలో విజయం సాధించిందని ఆయన అన్నారు. ఆ మహానేతకు ఇచ్చే గౌరవం కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X