వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర నేతలపై మొయిలీ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: పార్టీ సభ్యత్వ నమోదుకు సహకరించని నాయకులపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదుకు సహకరించని నాయకుల వివరాలు పంపాలని ఆయన శుక్రవారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు సూచించారు.

రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గత నాలుగు రోజులుగా సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుంచి జిల్లా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టెలీ కాన్ఫరెన్స్ లను వైయస్ జగన్ వర్గీయులు పలు చోట్ల అడ్డుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు సభ్యత్వ నమోదు చేయలేమని పలువురు నాయకులు చెబుతున్నారు. దీంతో మొయిలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పరిస్థితిలు చక్కబడిన తర్వాత సభ్యత్వ నమోదు చేయిస్తే బాగుంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X