వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయం గుప్పిట్లో బెజవాడ

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: కృష్ణానది సాగర్‌ గేట్లు దూకి, ఉగ్రరూపం దాల్చి ఊళ్ళకు ఊళ్ళను ముంచెత్తుతూ బెజవాడ చేరుకుంటున్నది. నది ఉరవడికి బలహీనంగా ఉన్న కరకట్ట తెగి వరద నీరు ఇబ్రహీంపట్నంలోకి చొచ్చుకొచ్చింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ నుంచి ఏడు వేల మందిని అధికారులు ముందుగానే ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. కొంతమంది మాత్రం పునరావాస శిబిరాలకు వెళ్ళమని మొండికేయడంతో వారిని అధికారులు బలవంతంగా తరలించారు.

వరద ఉధృతికి బెజవాడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణాలు ఉగ్గపట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించమంటూ పూజలు, యాగాలు చేస్తున్నారు.

పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజలను తరలించే విషయంలో పోలీసు, రెవిన్యూ అధికారులు అనుసరిస్తున్న వైఖరి కూడా ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. పైగా ఆదివారం పౌర్ణమి కావడంతో సముద్రపు పోటు కారణంగా నీటి ఉధృతి మందగించి విజయవాడ పట్టణంలో కర్నూలు కంటే భయానక వాతావరణం నెలకొంటుందనే ఆందోళన బెజవాడ వాసులను బెంబేలెత్తిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X