వరద మృతులు 52 మంది

ఇప్పటి వరకు 62,032 ఇళ్లు దెబ్బ తిన్నాయని ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం రాత్రి చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటి వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలు అల్లకల్లోలమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో 131 గ్రామాలను, గుంటూరు జిల్లాలో 110 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా మొత్తం 565 గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. 16.10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 10,534 పశువులు మరణించాయి.












Click it and Unblock the Notifications