వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాబూల్లో భారత ఎంబసీ వద్ద పేలుడు
భారీ పేలుడు శబ్దం వినిపించిన తర్వాత పెద్ద యెత్తున పొగలు లేచాయని చెబుతున్నారు. రెండు స్పోర్టీ యుటిలిటీ వాహనాలు ఈ పేలుడులో దెబ్బ తిన్నాయి. అందులో ఒకటి ఐక్య రాజ్య సమితి వాహనమని తెలుస్తోంది. భారత రాయబార కార్యాలయం వెలుపలే ఈ పేలుడు సంభవించింది. పరిసరాల్లో దుకాణాల అద్దాలు పగులుబారాయి. ఆత్మాహుతి బాంబర్ ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Thursday, October 8, 2009, 11:10 [IST]