కాబూల్లో భారత ఎంబసీ వద్ద పేలుడు

భారీ పేలుడు శబ్దం వినిపించిన తర్వాత పెద్ద యెత్తున పొగలు లేచాయని చెబుతున్నారు. రెండు స్పోర్టీ యుటిలిటీ వాహనాలు ఈ పేలుడులో దెబ్బ తిన్నాయి. అందులో ఒకటి ఐక్య రాజ్య సమితి వాహనమని తెలుస్తోంది. భారత రాయబార కార్యాలయం వెలుపలే ఈ పేలుడు సంభవించింది. పరిసరాల్లో దుకాణాల అద్దాలు పగులుబారాయి. ఆత్మాహుతి బాంబర్ ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications