విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాంతించిన కృష్ణమ్మ తల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakasm
విజయవాడ: మహోగ్ర రూపం ధరించిన కృష్ణమ్మ తల్లి శాంతించింది. కృష్ణానదిలో వరద ఉధృతి పూర్తిగా తగ్గింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్లం 14.6 అడుగులకు ఉంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలు కూడా తగ్గాయి. ప్రకాశం బ్యారేజీ కి ఇన్ ఫ్లో 5.60 లక్షల క్యూసెక్కులు ఉఁది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఎగువ గ్రామాల ప్రజలు వరద నుంచి బయటపడ్డారు. అయితే వరద అనంతర బీభత్సం తాండవిస్తూనే ఉంది.

కృష్ణా నగరంలోని పలు బస్తీలతో పాటు జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. నాగాయలంక, పల్లె నాగాయలంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. ఇబ్రహీం పట్నం మండలంలోని కొన్ని గ్రామాలు కూడా ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. అవనిగడ్డలోని పలు వార్డుల్లో వరద నీరు తొలగిపోలేదు.

వరద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచినీటి కోసం, గుక్కెటు తిండి కోసం అల్లాడుతున్నారు. చుట్టూ నీరు ఉన్నా తాగేందుకు అది పనికి రావడం లేదు. దీంతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నీరు తెచ్చుకుంటున్నారు. అయితే, కొత్తగా ప్రమాదం లేకపోవడం ప్రజలకు కొంత ఊరట కలిగించింది. కరకట్టలకు గండ్లు పడే ప్రమాదం ఉండడంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు పెద్ద ప్రమాదమేదీ సంభవించకుండానే బయటపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X