వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధితులకు హీరోలు విష్ణు, మనోజ్ ఓదార్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Manoj Kumar
మహబూబ్ నగర్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమారులు, సినీ హీరోలు మనోజ్ కుమార్, విష్ణువర్ధన్ గురువారం మహబూబ్ నగర్ జిల్లాలోని వరద బాధితులను పరామర్శించారు. వరద తాకిడికి తీవ్రంగా దెబ్బ తిన్న మహబూబ్ నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామాన్ని సందర్శించారు. అక్కడి వరద బాధితులను వారు ఆత్మీయంగా పలకరించారు.

వరదల్లో గ్రామస్థులు సర్వం కోల్పోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. రాజోలి గ్రామాన్ని తాము దత్తత తీసుకుంటామని వారు మీడియా ప్రతినిధులతో చెప్పారు. వరద తాకిడికి ప్రజలు గురి కావడం తమను ఎంతగానే కలచి వేసిందని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X