అమర్ సింగ్ పై రూ. 500 కోట్ల ఫ్రాడ్ కేసు

Amar Singh
కాన్పూర్: రూ. 500 కోట్ల మేరకు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణపై సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్, ఆయన భార్య పంకజా కుమారి సింగ్ లపై పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కాన్పూర్ పోలీసులు చెప్పారు. నల్లడబ్బును తెలుపు చేయడానికి అమర్ సింగ్, ఆయన భార్య కంపెనీల విలీనానికి పాల్పడ్డారనే ఆరోపణపై బాబూపూర్వ పోలీసు స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైనట్లు అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) బ్రిజ్ లాల్ చెప్పారు.

అమర్ సింగ్, ఆయన భార్య 2003 - 2008 మధ్య కాలంలో వారి కంపెనీలను ఇతర సంస్థల్లో కలిపి రూ. 500 కోట్ల మేరకు డబ్బు చేసుకున్నారని శివకాంత్ తివారీ తన 14 పేజీల ఫిర్యాదులో ఆరోపించినట్లు కాన్పూర్ డిఐజీ నీరా రావత్ చెప్పారు. ఫిర్యాదులో సింగ్ దంపతులు నడిపే సంస్థలో, వారికి సొంత సంస్థలో అయిన ఎనర్జీ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్, ఇడిసిఎల్ పవర్ లిమిటెడ్, పంకజా ఆర్ట్ అండ్ క్రెడిట్ లిమిటెడ్, సర్వోత్తమ్ క్యాప్ లిమిటెడ్, ఇడిసిఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈస్టర్న్ ఇండియా కంపెనీలను పేర్కొన్నారు. చిన్న సంస్థలను ఈ కంపెనీల్లో విలీనం చేశారనేది శివకాంత్ తివారీ ఆరోపించారు. ఉదాహరణకు సర్వోత్తమ్ క్యాప్ లిమిటెడ్ లో 25 కంపెనీలను విలీనం చేసినట్లు అతను అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+