మంత్రులు, అధికారులు భేష్: రోశయ్య
వరద బాధితుల కోసం లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థల సహాయం బాధితులకు అందేలా చూడాలని ఆయన సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని నష్టపరిహారం ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వరద సహాయక చర్యలపై త్వరలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రోశయ్య వీడియో కాన్ఫరెన్స్ కు మునుపటి కన్నా ఎక్కువగా 20 మంది మంత్రులు హాజరయ్యారు.
Story first published: Friday, October 16, 2009, 14:30 [IST]