హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంపన్న శ్రేణిని పక్కన పెట్టండి: కృష్ణయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Mukesh Goud
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన క్రీమీలేయర్ జీవోను పెండింగులో పెట్టాలని బిసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర బీసి సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అధికారులు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. క్రీమీలేయర్ జీవోను పక్కన పెట్టకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని, రాష్ట్ర బంద్ చేపట్టడానికి కూడా వెనకాడబోమని ఆయన అన్నారు.

ఉద్యోక నియామకాల్లో వార్షికాదాయం నాలుగు లక్షల రూపాయలు దాటిన సంపన్న శ్రేణికి రిజర్వేషన్లు వర్తించకుండా రాష్ట్ర సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోపై బీసిల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X