హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే సీతారెడ్డి కోసం 5 పోలీసు దళాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి పోలీసులకు దొరకకుండా నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమెను అరెస్టు చేసేందుకు ఐదు పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్టు మహబూబ్ నగర్ ఎస్పీ చెప్పారు. తన గన్ మన్ లను సీతా దయాకర్ రెడ్డ్డి మఊడు రోజుల క్రితమే సరెండర్ చేసి అండర్ గ్రౌండులోకి వెళ్ళిపోయారు. వ్యవసాయ అధికారి రాజేశ్వరి హత్య కేసులో సీతా దయాకర్ రెడ్డి ఒక నిందితురాలు. ఈ కేసులో మరో నిందితుడు దేవరకద్ర జెడ్పీటీసీ ప్రదీప్ గౌడ్ పరారీలో ఉన్నాడు. సీతారెడ్డి ముందస్తు బెయిల్ దరఖాస్తుపై నేడు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగనుంది.

వ్యవసాయాధికారి రాజేశ్వరి ఆత్మహత్య కేసులోటీడీపీ ఎమ్మెల్యే సీతాదయాకరరెడ్డి పేరును అన్యాయంగా ఇరికించారని, ఆమె పేరును ఆ కేసు నుంచి తొలగించేలా చూడాలని స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తెలుగుదేశం శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. టీడీఎల్పీ తరఫున ఎమ్మెల్యేలు నాగం జనార్ధనరెడ్డి, వేణుగోపాలాచారి, ఉమామాధవ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ శుక్రవారం స్పీకర్‌ ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందచేశారు. అధికారి ఆత్మహత్యతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోయినా పోలీసులు అన్యాయంగా ఆమెను ఇరికించారని వారు ఆరోపించారు.

'రాజేశ్వరి ఈ నెల 15న ఒకసారి, 17న ఒకసారి మరణ వాంగ్మూలం ఇచ్చింది. చివరగా 17వ తేదీన ఆమె ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని హైదరాబాద్‌లో ఒక మేజిస్ట్రేట్‌ నమోదు చేసుకొన్నారు. ఎమ్మెల్యే తనను బెదిరించలేదని, కేవలం విజ్ఞప్తి చేశారని రాజేశ్వరి అందులో చెప్పారు. ఆమె ఆత్మహత్యకు కారణమైనట్లుగా ఎమ్మెల్యే తీరు ఎక్కడా లేకపోయినా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు' అని వారు వివరించారు. దీనిపై ప్రభుత్వం నుంచి సమాచారం తెప్పించుకొంటానని స్పీకర్‌ వారికి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X