వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ లో అన్ని స్ధానాలకూ పోటీ: చిరంజీవి

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖ: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. అవసరమైతే తమతో కలిసివచ్చే భావసారుప్య పార్టీలతో ముందుకు వెళ్తామని చెప్పారు. పార్టీపై విమర్శలు చేస్తున్న కేఎస్‌ఆర్‌ మూర్తిపై చిరంజీవి మండిపడ్డారు. ప్రచారం కోసమే పార్టీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మూర్తి ప్రస్తుతం పార్టీలో ఉన్నారో? లేదో? తనకు తెలియదని చెప్పారు. ఇటీవల తెరాస అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్‌ మాట్లాడడాన్ని తప్పుబట్టారు.

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రరాపా అధినేత చిరంజీవి విమర్శించారు. వరద బాధితుల్లో ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోందని అన్నారు. వరద బాధిత ప్రాంత ప్రజల సహాయార్థం నగరంలో పార్టీ చేపట్టిన ప్రరాపా విరాళాల సేకరణ కార్యక్రమానికి వెళ్లే ముందు చిరంజీవి మీడియాతో మాట్లాడారు. నాలుగు జిల్లాల్లో వరదలొస్తేనే ప్రజలను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం..భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా వైపరిత్యాలు వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X