కెసీఆర్ నోట రక్తపాతం మాట
ఫ్రీజోన్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను కెసీఆర్ ఏకరువు పెట్టారు. నవంబర్ 4వ తేదీ లోపు ప్రజాస్వామ్య బద్దంగా ఫ్రీజోన్ అంశాన్ని రాజ్యాంగ సవరణ చేసి రద్దు చేయాలని, అలా చేయకపోతే అది రద్దయ్యే వరకు తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, నిరుద్యోగులు, తెలంగా ణ వాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. అవసరమైతే ప్రపంచ దేశాల్లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగుల నుండి లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆర్థించి ఉద్యమాన్ని కాపాడు కుంటామని కెసిఆర్ స్పష్టం చేసారు. తెలం గాణ ప్రత్యేక రాష్ర్టం వచ్చే దాకా తమ పోరాటం ఆగదని ప్రత్యేక రాష్ర్టంతోనే హక్కులు సిద్ది స్తాయన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటల రాజేందర్, మాజీ మంత్రులు హరీష్ రావు , కెప్టెన్ లక్ష్మీకాంతారావు, గుండె విజయరామారావు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.