జగన్ పొత్తు వద్దన్నారు: లక్ష్మారెడ్డి

ప్రజారాజ్యం పార్టీతో పొత్తును హైదరాబాదులోని బంజారాహిల్స్ కాంగ్రెసు శాసనసభ్యుడు, దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా వ్యతిరేకించారు. పొత్తు వల్ల కోమాలో ఉన్న ప్రజారాజ్యం పార్టీకి ప్రాణం పోయడం అవుతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాదులోని 24 శాసనసభా స్థానాల్లో కాంగ్రెసు 21 స్థానాలు గెలిచిందని, అందువల్ల ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుస్తుందని ఆయన అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తుపై కాంగ్రెసు శ్రేణుల అభిప్రాయం తెలుసుకోవాలని కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధించిందని, ఈ స్తితిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అవసరం లేదని ఆయన కరీంనగర్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ డిమాండ్ ను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications