పిసిసి పదవిపై వైయస్ జగన్ కన్ను?

చాలా కాలం మౌనంగా ఉన్న మాజీ మంత్రి మారెప్ప డి.శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. శ్రీనివాస్ టికెట్లు అమ్ముకున్నారని, వేల కోట్ల రూపాయల సంపాదించారని ఆయన ఆరోపించారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేయడమే కాకుండా వైయస్ జగన్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని ఆయన కోరుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా జగన్ ను చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి.
కాంగ్రెసు పార్టీకి జగన్ తప్ప మరో దిక్కు లేదనిపించడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకించి తమ సత్తా చాటామనే భావన కూడా జగన్ శిబిరంలో నెలకొని ఉంది. డి.శ్రీనివాస్ ను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తేవడమే మార్గంగా నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications