ఎర్రకోటకు మమతా బెనర్జీ బీటలు

Mamata Banerjee
కోల్ కత్తా: లోకసభ ఎన్నికల తర్వాత వామపక్షాలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ లో శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ వామపక్షాలను కంగు తినిపించారు. పది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెసు, కాంగ్రెసు కూటమి ఐదు స్థానాలను దక్కించుకోగా, మరో మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. శనివారం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నాడు జరుగుతోంది. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగిన పది స్థానాల్లో 2006 ఎన్నికల్లో వామపక్ష కూటమి మూడు స్థానాలను గెలుచుకుంది. వాటిలో ఒక్క స్థానంలో మాత్రమే ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఇమ్రాన్ రమోజ్ ముందంజలో ఉన్నారు. లెక్కింపు పూర్తయిన ఐదు స్థానాల్లో నాలుగు చోట్ల మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు విజయం సాధించగా, ఒక్క స్థానంలో కాంగ్రెసు విజయం సాధించింది.

కాగా, ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ హవా నడిచింది. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ కోటను బిఎస్పీ బీటలు వార్చింది. ఉత్తరప్రదేశ్ లో 11 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఐదు స్థానాలను బిఎస్పీ గెలుచుకుంది. కేరళలో మూడు స్థానాలను కూడా కాంగ్రెసు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+