ప్రేమికురాలిని మోసగించి పారిపోయిన యువతి
ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని ఇంతకాలం నమ్మించాడు. కాగా వీరి ప్రేమ విషయం రెండు కుటుంబాల సభ్యులకు తెలిసింది. కుమార్ కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. దీంతో రెండేళ్ల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పెద్ద మనుషుల సమక్షంలో కుమార్ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. కొద్ది రోజుల తర్వాత మళ్ల్లీ రెండు కుటుంబాల మధ్య వివాదాలు జరిగాయి. అబ్బాయి కుటుంబం చేసిన బెదిరింపులను తట్టుకోలేక అమ్మాయి తల్లిదండ్రులు ఇటీవల వేరే సంబంధం కుదుర్చుకున్నారు.
లావణ్యతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వారిని కుమార్ బెదిరించాడు. దీంతో ఈ సంబం«ధం ఎత్తిపోయింది. విధిలేని పరిస్థితిలో లావణ్య తండ్రి వెంకటాద్రి పోలీసుస్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశాడు. వీరితో ఎస్సై మహ్మద్ అలీ పెద్ద మనుషుల సమక్షంలో రెండు కుటుంబాల వారికి నచ్చజెప్పారు. బుధవారం వీరి వివాహం జరిపేందుకు నిశ్చయించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంలో వివాహ సమయానికి వరుడు కుటుంబ సభ్యులతో పరారయ్యాడు.
దీంతో ఆగ్రహించిన వధువు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వారి కోసం అన్వేషించారు. వరుడి సోదరుడు శ్రీనివాస్ వారికి దొరకడంతో అతడిని చెట్టుకు కట్టేసి నిర్బంధించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో 4 గంటల పాటు రాస్తారోకో చేశారు. ర్యాలీ నిర్వహించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు వరుడిని రప్పించి వివాహం జరిపించాలని పట్టుబట్టారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సై మహ్మద్ అలీ, వర్ధన్నపేట సీఐ బాలు జాదవ్ కూనూరు గ్రామానికి చేరుకుని మాట్లాడారు. గురువారం వీరికి వివాహం జరిపించేలా చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.