వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి: అద్వానీ వర్సెస్ రాజ్ నాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

BJP
న్యూఢిల్లీ: కాషాయ పరివారం పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత ఎల్ కె అద్వానీల మధ్య నిలువునా రెండు గ్రూపులుగా మారింది. పార్టీ వారసత్వ సమస్యను పరిష్కరించాలని బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ బుధవారం అధికారికంగా అడిగారు. దీని తర్వాత ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. రాజ్ నాథ్ బుధవారం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ను బుధవారం కలిశారు. అద్వానీ శిబిరాన్ని ఎదుర్కోవడానికి జోక్యం చేసుకోవాలని రాజ్ నాథ్ భగవత్ ను కోరినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

బిజెపిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆర్ఎస్ఎస్ నియంత్రించడాన్ని రాజ్ నాథ్ వర్గం అంగీకరిస్తోంది. అయితే అద్వానీ వర్గం మాత్రం పార్టీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదు. అయితే రాజ్ నాథ్ ఆర్ఎస్ఎస్ జోక్యాన్ని కోరినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ తో పాటు బిజెపి ఖండిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ తమ సిద్ధాందానికి స్ఫూర్తి అని, అది బిజెపి పవర్ హౌస్ అని ప్రకాష్ జవేదకర్ అన్నారు. అవసరమైతే ఆర్ఎస్ఎస్ బిజెపికి సలహాలు మాత్రమే ఇస్తుందని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ అన్నారు.

లోకసభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బిజెపిలో విభేదాలు పెద్ద యెత్తున పొడసూపాయి. ప్రస్తుతం విభేదాలకు ఆర్ఎస్ఎస్ కారణంగా మారింది. తర్వాతి పార్టీ అధ్యక్ష పదవిలో సీనియర్ నాయకుడెవరూ ఉండకూడదని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అయితే అద్వానీ వర్గం దాన్ని వ్యతిరేకిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X