నాగ్ పై విమర్శలకు సిగ్గు లేదా: జెపి

నేర రాజకీయాలకు కొమ్ము కాయకూడదని తాము గళమెత్తామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో నేరస్థులను ప్రోత్సహించడమే తెలుగుదేశం లక్ష్యమా అని ఆయన అడిగారు. ఆరోపణలు మానకుంటే కోర్టులో దావా వేస్తానని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను హెచ్చరించారు. నేటి తెలుగుదేశం వేరు, ఎన్టీఆర్ హయాంలోనే తెలుగుదేశం వేరని ఆయన అన్నారు. తమ మంచి తనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, సహనానికి కూడా హద్దుంటుందని ఆయన అన్నారు. తాము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామనే భయంతోనే తెలుగుదేశం పార్టీ తమపై శత్రుత్వం పెంచుకుంటోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications