హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Doctors
హైదరాబాద్: ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు గురువారం తమ సమ్మెను ఉధృతం చేశారు. అత్యవసర సేవలను మినహా అన్ని సేవలను వారు బహిష్కరించారు. ప్రభుత్వానికి మరో 48 గంటలు గడువు ఇస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం స్పందించకపోతే ఆ తర్వాత అత్యవసర సేలను కూడా బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం కన్వీనర్ హెచ్చరిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ నాలుగు గంటల పాటు జూనియర్ వైద్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని పది బోధనాస్పత్రుల్లో దాదాపు 4,300 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున కోడ్ అమలులో ఉందని, ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం అంటోంది. హైదరాబాద్ ఎన్నికలను సాకుగా చూపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ సమస్యను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందని జూనియర్ డాక్టర్లు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగానే వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఎంత పెంచుతామనే విషయాన్నైనా ప్రభుత్వం చెప్పకపోవడం దారుణమని వారన్నారు.

జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే అందుకు బాధ్యత తమది కాదని, ప్రభుత్వమే బాధ్యత వహించాలని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. తాము చెబుతూనే ఉన్నామని, అయినా ప్రభుత్వం తమ మాటలను పట్టించుకోలేదని వారంటున్నారు. ప్రజలు, ప్రభుత్వం తమను క్షమించాలని, సమ్మె చేయడం తప్ప మరో మార్గం లేదని వారు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X