కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులివెందుల అభ్యర్థిత్వంపై జగన్ చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థిత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన కుటుంబ సభ్యులతో, అత్యంత సన్నిహితులతో గురువారం సమావేశమయ్యారు. తన స్వగ్రామం ఇడుపులపాయలోని తన అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ చిన్నాన్న, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైయస్ వివేకానందరెడ్డితో పాటు మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పులివెందుల నియోజక వర్గం అభ్యర్థిగా జగన్ పేరును ఖరారు చేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. జగన్ బుధవారం సాయంత్రం కడప జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జ్యోతి రెడ్డితో మాట్లాడారు.

మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించి వివిధ పథకాలకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన నివాళులు అర్పించారు. ఆయన వెంట వైయస్ వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X