హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వంతో జూడాల చర్చలు విఫలం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Doctors
హైదరాబాద్: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ సమ్మెను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి తమ సమ్మెను ఉధృతం చేస్తామని వారు చెప్పారు. తమ సమ్మె వల్ల సంభవించే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య తమను చర్చలకు ఆహ్వానించలేదని వారు చెప్పారు.

ఇదిలావుంటే, జూనియర్ డాక్టర్ల సమ్మె చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రతి ఏడు ఒక తంతులా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి ప్రభుత్వం పరిష్కారం ఆలోచించాలని శుక్రవారం సూచించింది. జూనియర్ డాక్టర్ల సమ్మెపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు ఆరోగ్య శాఖ కార్యదర్శికి, డిఎంఓ, జానియర్ డాక్టర్ల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X